Wednesday, October 30, 2013

సజీవ దహనం-ఎప్పటికీ మిస్సింగ్ కేసు.

ఫోన్ రింగ్ అవుతోంది.
శేఖర్ లిఫ్ట్ చేశాడు.
''''''సార్ రవి ఫాదరా మీరూ అన్నాడు అవతలి వ్యక్తి.'''''
అవును అన్నాడు శేఖర్.
''''సార్ నాకు ఓ ఫ్రెండ్ ఇచ్చాడు మీ నంబరు.
రవీ నేను చాల రోజులు ఒకే ఆఫీసులో పని చేశాం.ఆ రోజులని చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం.చాలా సంవత్సరాలు అయిపోయినయ్.రవి ని చూడాలని ఉంది.అందుకే మీకు ఫోన్ చేశా''''
అన్నాడు అవతలి వ్యక్తి.
'చాలా సంతోషం బాబు.కానీ రవి ఇప్పుడు ఇక్కడ లేడు .చెన్నై లో జాబ్ చేస్తున్నాడు.
నీకు నంబర్ ఇస్తాను.మాట్లాడు.లేదా హైద్రాబాద్ వచ్చినప్పుడు నీకు ఇదే నంబరు కి ఫోన్ చేస్తాను .వచ్చి కలవొచ్చు.సరెనా?' అన్నాడు శేఖర్..
''''సరె సార్ అన్నాడు అవతలి వ్యక్తి.""ఫోన్ పెట్టేశాడు.
మీ దృష్టి లో రవి చెన్నై లోనే ఉంటాడు. కొన్నాళ్ళకి మీరు రవి మిస్సింగ్ అని ప్రకటన కూడా ఇస్తారు పేపర్లలో ,టీవీలలో.
అసలు విషయం మీకు తెలియదు.
రవి చెన్నై నుండి బెంగుళూరు వెళ్ళాడు.అక్కడి నుండి మిమ్మల్ని చూడడానికి హైదరాబాదు బయలుదేరాడు వోల్వో బస్సు లో .అందులో నలభై ఆరు మంది సజీవ దహనం అయిపొయ్యారు.
మీకు రవి ఫోన్ చేసి చెప్పలేదు తను ఎక్కడెక్కడికి వెళ్ళ్తున్నదీ.
అందుకే అతను ఎప్పటికీ మిస్సింగ్ కేసుగ నే మిగిలిపోతాడు. .
ఎక్కడికి వెళ్తున్నదీ ఎప్పుడు మీ వాళ్ళకి చెప్తూ ఉండండి.

No comments: